Errabelli Dayaker Rao | వరంగల్ : జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు మిర్చి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బోగస్ మాటలు మాట్లాడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, అబద్ధాలు మాట్లాడడం మానుకో అని హెచ్చరించారు.
రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు. తెలంగాణలో రైతులు ఆవేదన చెందుతున్నారు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లలో పెట్టుకుంటున్నారు. మిర్చి రైతును ఆదుకోవాలి, క్వింటాకు 25 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలి. కేసీఆర్ మనసున్న మహారాజు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజుల్లాగా బతికారు. రైతులను అన్ని విధాలా ఆదుకున్న ఘనత కేసీఆర్కే దక్కుతుంది అని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Telangana | రాష్ట్రంలో మళ్లీ యూరియా గోస.. నిండుకున్న మార్క్ఫెడ్ బఫర్ నిల్వలు!
Congress Govt | బడా ఏజెన్సీలకే ఇసుక.. గంపగుత్తగా అప్పగించనున్న కాంగ్రెస్ సర్కారు!
Ration Cards | ఈసారైనా ఇచ్చేనా.. మార్చి 1న కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఆ జిల్లాల్లోనే!