హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీలపై దాడులను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటే సరిపోదని, ఆ దాడులకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన మూలాలను గుర్తించి అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ స్వచ్ఛంద సంస్థ ‘లా పైలట్ ఫౌండేషన్’ తరఫున డైరెక్టర్ బీ కార్తీక్నవాయన్ దా ఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి ఈ ఆదేశాలు జారీచేసింది.