సిటీబ్యూరో, జులై 8(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు మళ్లీ పంజా విసిరారు. వేర్వేరు ఘటనల్లో రూ. 5.10 లక్షలు దోచుకున్నారు. ముషీరాబాద్కు చెందిన సంపత్కు ఫేస్బుక్లో సైబర్నేరగాళ్లు లండన్ యువతిగా పరిచయమయ్యారు. ఇద్దరం ఒకే మతానికి చెందిన వారమంటూ.. కొన్ని రోజులు చాటింగ్ చేశారు. స్నేహానికి గుర్తుగా గిఫ్ట్ పంపిస్తున్నామంటూ నమ్మించారు. ‘ఎయిర్పోర్టు నుంచి మీ పేరుతో విలువైన గిఫ్ట్లు వచ్చాయి..వాటికి కస్టమ్స్ క్లియరెన్స్ లేదం’టూ దఫ దఫాలుగా రూ. 3.10 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు.. సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ జూబ్లీహిల్స్కు చెందిన సర్వన్కుమార్ అనే యువకుడికి రూ. 2 లక్షలు టోకరా వేశారు.