మహేశ్వరం : ప్రతి ఒక్కరూ దైవ చింతనను అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం మహేశ్వరంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరస్వామి, గట్టుపల్లిలోని శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆమె మాట్లాడుతూ పరమేశ్వరుడి కృపతో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కౌశిక్రెడ్డి ఎంపీపీ రఘుమారెడ్డి సహకార బ్యాంకు చైర్మన్ మంచె పాండుయాదవ్ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, మాజీఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.