వాటర్ జెట్ క్లీనింగ్ యంత్రాలతో సులభంగా మరుగుదొడ్ల క్లీనింగ్
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఇచ్చే యోచన
హైదరాబాద్, ఏప్రిల్ 3 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. స్కూళ్లకు వాటర్ జెట్ క్లీనింగ్ మిషన్లను అందజేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. మన ఊరు-మన బడిలో భాగంగా తొలివిడతలో 9,123 స్కూళ్లకు వీటికి ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. బషీర్బాగ్లోని సమగ్రశిక్ష అభియాన్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి వాటర్ జెట్ క్లీనింగ్ యంత్రాలను పరిశీలించారు.
అధికారుల వివరణపై సంతృప్తి చెందిన కేటీఆర్.. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఈ క్లీనింగ్ యంత్రాలను అందజేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 26 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో 20 వేల పైచిలుకు స్కూళ్లు ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలే. పిల్లలు టాయ్లెట్లను వినియోగిస్తుండటంతో పారిశుద్ధ్య నిర్వహణ సమస్యగా మారుతున్నది. స్కూళ్లల్లో శానిటైజేషన్ వర్కర్లను నియమించాలన్న డిమాండ్లు వచ్చాయి. ప్రభుత్వం స్పందించి పారిశుద్ధ్య నిర్వహణను పంచాయతీరాజ్, పురపాలన, పట్టణాభివృద్ధిశాఖలకు అప్పగించింది. తాజా ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపి వాటర్ జెట్ క్లీనింగ్ మిషన్లు అందజేస్తే పారిశుద్ధ్య సమస్య తీరుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఉపయోగాలు..