యాదాద్రి, డిసెంబర్ 12: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి కొండపై ప్రతి కట్టడం పూర్తి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పునర్నిర్మాణాలు జరిగాయి. కట్టడాలను చూసి భక్తిభావం పెంపొందాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొండపై నిర్మించిన తెలంగాణ టూరిజం హరిత హోటల్ భవనాన్ని వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు సోమవారం హోటల్ పునర్నిర్మాణ పనులను ఆలయ అధికారులు, అర్చకులు, టూరిజం అధికారులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. పూర్తి ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా కాకతీయ పిల్లర్లు, దేవతామూర్తులు, పంచనారసింహుడి ప్రతిమలతో తీర్చిదిద్దనున్నారు.