యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి వారికి నిత్య ఆరాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆర్జిత పూజల కోలాహలం ఆది వారం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారం భించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
హారతి నివేధనలు అర్పించారు.సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహు డిని ఆరాధిస్తూ సుమారు గంటన్న రకు పైగా కల్యాణ తంతు జరిపారు.
కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖమండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో స్వల్ప రద్దీ కొనసాగింది. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.