Etamatam | బీజేపీకి అసలే అభ్యర్థులు దొరకక ఒక్కొక్కరికి డబుల్ ధమాకాగా రెండు, మూడేసి టికెట్లు ఇస్తుంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక నాయకురాలు టికెట్ అమ్ముకున్నారని పార్టీ పెద్దలపై దుమ్మెత్తిపోయడం నిజంగా వార్తే. ఈమె గోల ఏంటని రాష్ట్ర నాయకుడు ఒకరు విసుక్కున్నారు.
పక్కనున్న మరో నాయకుడు జోక్యం చేసుకుంటూ… వద్దు…వద్దు ఆమెను ఏమనవద్దు. టికెట్ అమ్ముకున్నారని ఆరోపణ రావడం కూడా మంచిదే. మన టికెట్కు కూడా డిమాండ్ ఉందని ప్రజలకు సంకేతం పంపించినట్టు అవుతుందని సర్దిచెప్పారట. టికెట్ అమ్ముకున్నారనే ఆరోపణ పార్టీ ఇమేజ్ని పెంచుతుందని సదరు నాయకుడు జ్ఞాన బోధ చేసినట్టు వినికిడి. మరక కూడా మంచిదే.