కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. నాలుగు రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 3,882 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,444 ఓట్లు, కాంగ్రెస్కు 234 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్లో బీజేపీకి 562 లీడ్ రాగా, నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 1,825 ఓట్ల ముందంజలో ఉన్నారు.