హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మలక్పేట యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ను ఏర్పాటుచేశారు. హైదరాబాద్-విజయవాడ హైవే-65పై నల్లగొండ జిల్లాలో గుండ్రాంపల్లి, కట్టంగూర్ వద్ద ఒక్కోటి అందుబాటులో ఉంచారు. వీటిల్లో అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్లు, 24 గంటలు కేర్ టేకర్లు ఉంటారు.
ఉచిత అంబులెన్స్ సర్వీస్ను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.