సంగారెడ్డి : పటాన్చెరు పారిశ్రామిక వాడలో పని చేస్తున్న కార్మికులను దృష్టిలో ఉంచుకొని.. ఇక్కడ 30 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి, డిస్పెన్సరీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బుధవారం ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆర్సీ పురంలో ఈఎస్ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 2 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందని గుర్తు చేశారు. పటాన్చెరు పారిశ్రామిక వాడలో సుమారు 2 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే లక్షలాది మంది కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ఆర్సీపురం ఈఎస్ఐ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.