హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): పీజీ డిప్లొమా కోర్సుల నిర్వహణలో భాగంగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ)-జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
జేఎన్టీయూహెచ్ క్యాంపస్లో శుక్రవారం వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ వ్యవహారాల అధికారి డాక్టర్ లక్ష్మణ్రావు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్వేత, ఈఎస్సీఐ డైరెక్టర్ రామేశ్వర్రావు, సెంటర్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హెడ్ వెంకట్రెడ్డి, ఐటీ హెడ్ సయ్యద్ అజ్గర్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సెల్ సాయికిశోర్లు ఇరువురు ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు. ఒప్పందంలో భాగంగా ఏడాది కాలపరిమితితో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ఆర్బిట్రేషన్ ప్రోగ్రాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ (పీజీసీసీఎస్) కోర్సులను నిర్వహిస్తామని కట్టా నర్సింహారెడ్డి తెలిపారు.