హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. రాజధాని కట్టుకోవడం చేతకాని వాళ్లు, తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని మండిపడ్డారు. శుక్రవారం సెక్రటేరియట్ మీడియా పాయింట్లో శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో రాజధాని లేని ఏకైక రా ష్ట్రం ఏపీ అని, చేతనైతే ముందు రాజధాని కట్టుకోవాలని సూచించారు. ఆంధ్రాలోని రాజకీయ నేతలంతా ఆ రాష్ట్రంలో ఉండలేక హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారని ఎద్దేవాచేశారు. ఏపీపీఎస్సీని గబ్బు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. బొత్స మంత్రిగా ఉన్నప్పుడే ఇంటర్వ్యూల పేరుతో ఉద్యోగాలు అమ్ముకున్నట్టు అనేక ఆరోపణలు వచ్చాయని, వాటిపై బొత్స ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఏపీలో ఇంజినీరింగ్ విద్య బాగాలేదని, ఏపీకి చెందిన సుమారు 80 వేల మంది విద్యార్థులు తెలంగాణలో ఇంజినీరింగ్ చదువుతున్నారని, దీనిపై బొత్స ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
ధర్మపురిఅర్వింద్.. అబద్ధాలతోఇంకెంతకాలం పబ్బం గడుపుతావ్?
పసుపు బోర్డు విషయం గుర్తుందా? అని ఎంపీ అర్వింద్ను ఎర్రోళ్ల ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని, ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. వైద్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని
హెచ్చరించారు.