పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి, ఏప్రిల్ 30 : ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకోవాలని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కోరుకొన్నట్టు పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కరోనా పీడ త్వరగా వదిలిపోవాలని ఆయన ఆకాంక్షించారు.