Errabelli Dayaker Rao | యాదాద్రి భువనగిరి : తమ ఇంటి ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వారికి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించినట్లు మంత్రి పేర్కొన్నారు.