Errabelli Dayaker Rao | టీఎస్పీఎస్సీ( TSPSC ) పేపర్ లీక్పై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తున్న బీజేపీ( BJP ), కాంగ్రెస్ పార్టీ( Cobgress Party )ల అధ్యక్షులు బండి సంజయ్( Bandi Sanjay ), రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayaker Rao ) నిప్పులు చెరిగారు. ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే నిరూపించాలని వారికి దయాకర్ రావు సవాల్ విసిరారు.
గాలి మాటలు మాట్లాడి, బట్టలు కాల్చి మీద వేయడం సరికాదన్నారు. మంత్రి కేటీఆర్( KTR ) తెలంగాణ( Telangana ) రాష్ట్రాభివృద్ధికి రాత్రిపగలు తేడా లేకుండా పని చేస్తున్నారని పేర్కొన్నారు. సంజయ్, రేవంత్ రెడ్డి కలిసి నోటికి వచ్చినట్లు మాట్లాడి, ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని తెలిపారు. సరైన సమయంలో ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. టీఎస్పీఎస్సీ( TSPSC ) పేపర్ లీకేజీ విషయంలో దర్యాప్తు జరుగుతుందన్నారు. ఎవరు దొంగలో ఎవరు దొరలో దర్యాప్తులో తేలుతుందన్నారు.