జనగామ, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : భూములు కబ్జా చేశారంటూ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు ఆడారని, వాటిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ చేశారు. గురువారం జనగామలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘నేను వారసత్వ భూ ములు అమ్ముకొని రాజకీయాలు చే శాను. నీలాగా కబ్జాలు చేయలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాల బండారం బయట పడుతుందనే ప్రతిపక్ష పార్టీ సభ్యులను సస్పెండ్ చేసి అబద్ధాలకు తెరలేపావు. ప్రింటింగ్ ప్రెస్ నడిపిస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే నువ్వు.. మా గురించి తప్పుగా మాట్లాడుతావా? దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో భూ కుంభకోణాలపై విచారణ జరిపిం చు. అధికారులను అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడితే ప్రజలే తరిమికొడుతారు జాగ్రత్త’ అని హెచ్చరించారు.