హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. పచ్చదనంతో తెలంగాణ కళకళలాడిపోతోంది. పల్లెప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు కొత్తరూపును తీసుకొచ్చాయి. పట్టణాల్లో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్టు పార్కులు నగర వాసులకు మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఈ క్రమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గ్రీనరీలో టాప్లో నిలిచిందని ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్ కొనియాడారు. హైదరాబాద్ నగరం వరల్డ్ ట్రీ సిటీగా నిలిచింది. ఇది అద్భుతం అని సోలిహిమ్ పేర్కొన్నారు. ఇప్పుడు మేడ్చల్ జిల్లాలోని ఓ అర్బన్ ఫారెస్టు పార్కు పచ్చదనంతో కళకళలాడిపోతోందని ఏరిక్ సోలీహిమ్ ప్రశంసలు కురిపిస్తూ పార్కుకు సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు.
మేడ్చల్ జిల్లాలోని అర్బన్ ఫారెస్టు పార్కు ఆయుష్ వనం.. హైదరాబాద్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. పక్షుల కిలకిల రావాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. పర్యాటకులు సేద తీరేందుకు అద్భుతమైన షెడ్లను నిర్మించారు.
Telengana is Indian 🇮🇳 leader in greening the land and Hyderabad is a world tree city. Bravo!
Yet another in Medchal District…connect with nature…Urban Forest Park under Telanganaku Haritha Haram..@dobriyalrm
pic.twitter.com/sJvLI7Vq6t— Erik Solheim (@ErikSolheim) February 16, 2022