PAB | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 44% స్కూళల్లో ఎన్రోల్మెంట్ 50 మందిలోపే ఉన్నదని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) నివేదిక పేర్కొన్నది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పీఏబీ నివేదికను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో రూ.1,907 కోట్లు ఖర్చుచేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్రం వాటాగా రూ.1,148 కోట్లు, రాష్ట్రం వాటాగా రూ.759 కోట్లు ఖర్చుచేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర విద్యాశాఖ సమర్పించిన వివరాలను ఆధారంగా చేసుకుని ఆయా అంశాలనే కేంద్రం పీఏబీ నివేదికలో ప్రస్తావించింది. ఈ ఏడాది ఆమోదించిన బడ్జెట్ను విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యానిఫాంలు, కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎంఆర్సీ, సీఆర్సీ గ్రాంట్స్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలతోపాటు సివిల్వర్క్స్, స్మార్ట్క్లాస్రూంలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు తదితర అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ నిధుల్లో ఎక్కువ మొత్తం ఉద్యోగుల జీతాలకు వెళ్లనున్నాయి. దీంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దగా అవకాశం ఉండదని భావిస్తున్నారు.
నివేదికలోని ముఖ్యాంశాలు