గిర్మాజీపేట, ఫిబ్రవరి 26: వరంగల్లో ఆదివారం ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన పాపయ్యపేట చమన్ కుంటిభద్రయ్య గుడి దగ్గర చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన రక్షిత (21) నర్సంపేటలోని జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నది.
ఆదివారం వరంగల్లో ఉండే బంధువుల ఇంటికి వచ్చింది. ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. కళాశాలలో ఓ మిత్రుడి వేధింపులే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.