హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : టీజీ జెన్కోకు జనరేటింగ్ స్టేషన్లే కీలకం. వీటిల్లోనే ఉద్యోగులు, ఇంజినీర్లు, సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుంది. కీలకమైన విద్యుత్తు ప్లాంట్లల్లో ఇంజినీర్ల కొరత వేధిస్తున్నది. ము ఖ్యంగా యాదాద్రి, భద్రాద్రి పవర్ప్లాంట్లల్లో సమస్య పట్టిపీడిస్తున్నది. విద్యుత్తు సౌధలో మాత్రం కొందరు పదేండ్లు గా పనిచేస్తున్నారు. అధికారిక సమాచారం ప్ర కారం పదేండ్లుగా విద్యుత్తు సౌధలోనే పాతుకుపోయిన వారి సంఖ్య అక్షరాల 103 మంది. వీరు అస్సలు విద్యుత్తు సౌధను వదలడంలేదు.
వీరిలో అత్యధికులు అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్లే. కొంతకాలం క్రితం 40మంది ఇంజినీర్లకు ఉద్యోగోన్నతులిచ్చి బదిలీచేశారు. రెగ్యులర్ బదిలీలు లేకపోవడం, అసలు బదిలీలకు ఓ విధానం లేకపోవడంతోనే ఈ సమ స్య తలెత్తుతుందని ఇంజినీర్ల సంఘాలు వా పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజినీర్ల హేతుబద్దీకరణకు జెన్కో యాజమాన్యం ఓ కమిటీ వేసింది. మ్యాన్ మెగావాట్ రేషియా, సీఈఏ మార్గదర్శకాలు అనుసరించి హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్) చేయనున్నది.
