అమ్మా.. నాన్న నన్ను క్షమించడి అంటూ సూసైడ్ నోట్
కనగల్: అమ్మా.. న్నాన నన్ను క్షమించండి మీకు నా మొఖం చూపించలేను. మీరు నామీద పెట్టుకున్న ఆశలు అడి ఆశలయ్యాయి. నేను మాట నిలబెట్టుకోలేకపోయిన .. మిమ్మల్ని వదిలివెళుతున్నా నన్ను క్షమించండి అంటూ ఆ విద్యార్థిని రాసిన లేఖ పలువురిని కంటతడి పెట్టించింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్థుల్లాపురానికి చెందిన కోయ రవీందర్ రెడ్డి, అరుణ దంపతుల ఏకైక కూమార్తె స్నేహా రెడ్డి(17) ఇటీవల ఎంసెట్ పరీక్ష రాయగా బుధవారం ఫలితాలు వచ్చాయి. ఫలితాల్లో స్నేహాకు మంచి మార్కులు రాకపో వడంతో పాటు క్వాలీఫై కాలేకపోయింది.
దీంతో మానస్థాపం చెందిన స్నేహా మధ్యాహ్నం 2గంటల సమయంలో ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహాత్య చేసు కుంది. తల్లి అరుణ ఏఎన్ఎం కాగా విధులపై కురంపల్లికి వెళ్లింది. అమ్మను తీసుకురమ్మని తమ్ముడు సిద్ధును బయటకు (కురంపల్లి)కి పంపి సూసైడ్ నోట్ రాసి అత్మహత్యకు పాల్పడింది. ఇది ఇలాఉంటే స్నేహా ఇంట్లో ఉరేసుకోగా అదే సమ యంలో తండ్రి బావి వద్ద వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చినప్పటికీ ఇదేమి తెలియక అతను బయటే కాళ్లు చేతులు కడుక్కొని ఇంటి ఆవరణలోనే కూర్చిండిపోయాడు. కూతురు ఉరేసుకోవడాన్ని గ్రహించలేకపోయాడు.
కొద్దిసేపటికి సిద్ధు తల్లిని బైక్పై తీసుకురాగా ఇంట్లోకి వెళ్లి చూసే సరికి స్నేహా కొన ఊపిరితో ఫ్యానుకు వెళాడుతూ కని పించింది. వెంటనే ఆమెను కిందకి దించినప్పటికీ ఆలస్యం కావడంతో ప్రాణాలు విడిచింది. స్నేహా తల్లి ఏఎన్ఎం కావడం తో కూతురు చనిపోయిందని తెలిసీ తెలియక పల్స్ రేట్ చూస్తున్న తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. అయితే తాను నేరుగా ఇంట్లోకి వెళ్లి ఉంటే కూతురుని కాపాడుకుని ఉండేవాడినని తండ్రి కన్నీళ్ల పర్యంతమయ్యాడు.