జగిత్యాల : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి , మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూర్ , ఎండపల్లి మండలాల్లోని పలుగ్రామాలకు చెందిన యువకులు టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలకు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్శితులై యువకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేండ్లలో ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం బెంగళూరును దాటి నెంబరు వన్ స్థానానికి చేరుకుందని అన్నారు. కేంద్రం ఇస్తామని ప్రకటించిన ఉద్యోగాల గురించి బీజేపీ నేతలను యువత నిలదీయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను వేలం పెట్టి విక్రయిస్తున్నారని, 8 లక్ష ల 50 వేల ఉద్యోగాలు కొల్ల గొట్టారని పేర్కొన్నారు. కేంద్రంలో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్లో యువత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.