ధర్మసాగర్, జూన్ 12: ఉపాధి హామీ పనులు భేష్గా జరుగుతున్నాయని జాతీయ గ్రామీణ అభివృద్ధి అధికారుల బృందం పేర్కొంది. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం కమ్యూనిటీ భూమిలో గ్రామంలో నీటి నిల్వ కోసం చేపడుతున్న ఫాంపాండ్ (నీటి గుంత)ను జాతీయ గ్రామీ ణాభివృద్ధి అధికారుల బృందం కార్యదర్శి ధర్మవీర్ ఝా(న్యూఢిల్లీ), ప్రాజెక్టు అధికారి హన్సాల్ సూతర్, రాష్ట్ర అదనపు కమిషనర్ ప్రసాద్, జాయింట్ కమిషనర్ జగత్ రెడ్డి పరిశీలించారు.
వర్షపు నీటిని భూమిలో నిల్వ చేసేందుకు ఫాంపాండ్ ఉపయోగంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇలాంటివి మండలంలోని రాపాకపల్లె, నారాయణగిరి, ధర్మపురం, తాటికాయల, కరుణాపురం, పెద్దపెండ్యాల తదితర గ్రామాల్లో కూలీలు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఎంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు? రికార్డులు సక్రమంగా ఉన్నాయా? అని ఎంపీడీవో జీ జవహర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
ఎంత వరకు కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు? రోజు వారీగా ఎన్ని పైసలు వస్తున్నాయి? అని ఇలాంటి విషయాలను కూలీలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. పనుల పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో సంపత్, కరుణాపురం సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ శ్రావణి, జేఈ శ్రీనివాస్, టీఏ కమలాకర్ ఉన్నారు.