హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలిస్తామని ఎన్నికల్లో హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దానిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఐదో తేదీ దాటినా చాలా సబ్ ట్రెజరీల్లో ఇప్పటి వరకు టీచర్లు, ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ఒకటో తేదీన కొందరికి వేతనాలు వేసిన ప్రభుత్వం అందరికీ ఇచ్చినట్టు చెప్పుకున్నది. వాస్తవానికి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో వేతనాలు జమకాలేదు. పింఛన్లు కూడా పడకపోవడంతో లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. వేతనాల విషయంలో ప్రభుత్వం పక్కా వ్యూహంతో వెళ్తున్నట్టు అర్థమవుతున్నది. ఒక జిల్లాలో మూడు, నాలుగు సబ్ ట్రెజరీలుంటే ఒక ట్రెజరీలో జమచేసి జిల్లా అంతా ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటూ మిగతా ట్రెజరీల్లో వేతనాలు ఆలస్యంగా జమచేస్తున్నది.
వాస్తవ పరిస్థితి ఇలా