మంత్రి హరీశ్రావుకు సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం వినతి
హైదరాబాద్, మార్చి 12 : కాంట్రిబ్యూటరీ పెన్షన్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాన్ని సమర్పించింది. ఇటీవలే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేస్తామని ప్రకటించాయని, ఇదే తరహాలో తెలంగాణలోనూ సీపీఎస్ను రద్దుచేయాలని కోరారు. మంత్రిని కలిసినవారిలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు తదితరులు ఉన్నారు.