హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానమున్న వారికీ పోటీ చేసే అర్హత కల్పించేలా సవరణ తేవాలని 1995 ఎన్నికల చట్టం రద్దు ఉద్యమ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిమాన్ గాంధీనాయక్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును శుక్రవారం బంజారాహిల్స్ మంత్రుల నివాస ప్రాంగణంలో కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.