హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని 100 మెగావాట్లకు పెంచబోతున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
వ్య ర్థాల నుంచి విద్యుత్తు తయారు చేయడం లో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ ముం దున్నదని చెప్పడానికి గర్వపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే 20 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు చేశామని, దీనిద్వారా ఇప్పటివరకు 225 మెగావా ట్ల కరెంటు ఉత్పత్తి అయ్యిందని కేటీఆర్ మంగళవారం ట్విట్టర్లో తెలిపారు.