హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. హైదరాబాద్ మింట్కంపౌండ్లోని తన కార్యాలయంలో విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి జేఏసీ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ (టీఈఈ), తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ (టీఎస్పీఈ) జేఏసీ నేతలతో మంత్రి వేర్వేరుగా సంప్రదింపులు జరిపారు. పీఆర్సీ సహా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అంశంపై చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగినట్టు నేతలు ప్రకటించారు. వేతన సవరణపై కొంత స్పష్టతరాగా, సోమవారం మళ్లీ చర్చలు జరుపుతామని ప్రభుత్వం జేఏసీ నేతలకు తెలిపింది.
చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలతో సోమవారం చర్చలు జరుపుతామని, జేఏసీ నేతలు అందుబాటులో ఉండాలని సూచించింది. యాజమాన్యం నుంచి టీఎస్ ట్రాన్స్కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎన్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఏ గోపాల్రావు, టీఎస్ ట్రాన్స్కో, జెన్కో జేఎండీ శ్రీనివాస్రావు, టీఈఈ జేఏసీ నేతలు ఎన్ శివాజీ, కోడూరి ప్రకాశ్, పాపకంటి అంజయ్య, జాన్సన్, నాజర్ షరీఫ్, మాతంగి శ్రీనివాస్, రామేశ్వరయ్యశెట్టి, తుల్జారాంసింగ్, కరెంట్రావు, టీఎస్పీఈ జేఏసీ నేతలు సాయిబాబు, శ్రీధర్, రత్నాకర్రావు, బీసీరెడ్డి, వజీర్, అనిల్కుమార్, వెంకన్నగౌడ్, సుధాకర్రెడ్డి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.