నర్సాపూర్, మే 22 : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని విద్యుత్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేసి ఏడీఈని రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు. ఓ కాంట్రాక్టర్ 11 బిల్లులకు చెందిన రూ. 3.13 లక్షల బిల్లుల కోసం ఏడీఈ రమణారెడ్డిని ఆశ్రయించాడు. ఆయన బిల్లుల మంజూరు కోసం రూ. 30వేల లంచం డిమాండ్ చేశాడు.
శుక్రవారం ఏడీఏ రమణారెడ్డి తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి రూ. 25వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ బృందానికి రెడ్హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఏడీఈ రమణారెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.