హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో నిర్వహించే ఎమ్మెల్సీ స్థానాలకు తొలిరోజు శుక్రవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.
మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి దేవన్నగారి మల్లారెడ్డి, గుర్రం చెన్నకేవశరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఒక్క నామినేషన్ రాలేదు.