న్యూఢిల్లీ: రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఉపసంహరించుకుంది. యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు (Rythu Bandhu) పంపిణీకి గత శుక్రవారం (నవంబర్ 24న) ఈసీ అనుమతించింది. ఈ నెల 28వ తేదీలోపు పంట సాయాన్ని అందించాలని పేర్కొంది. దీంతో సమయానికి పంటసాయం అందుతుందని రైతులంతా ఎదురుస్తున్న వేళ.. అనుమతులను ఉపసంహరించుకుంటూ సోమవారం ఉదయం ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.