Lok Sabha Polls | లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. పెట్రోలియం సంస్థలు, రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నది. బీఆర్కే భవన్లో ఓటర్ అవెర్నెస్ పోస్టర్ను విడుదల చేశారు. రైల్వేతో పాటు పెట్రోలియం సంస్థల్లో ఓటరు అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా నిఘా వ్యవస్థను విస్తృతం చేసినట్లు సీఈవో వికాస్రాజ్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలింపుతో పాటు నిల్వల సైతం నిఘాను పెంచాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.