Election Commission | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం (నవంబర్ 30)న జరుగనున్నాయి. ఓట్ల పండుగకు ఎన్నికల కమిషన్ సర్వత్రా ఏర్పాట్లు చేసింది. ఓటర్లు అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ నెల 30న సెలవు ప్రకటించాలని విద్యా, వ్యాపార సంస్థలతో పాటు పలు కంపెనీలను సైతం ఆదేశించింది. అయితే, చాలా కంపెనీలు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని.. సెలవులు ఇవ్వడం లేదని పలువురు ఉద్యోగులు వాపోపోతున్నారు. ఈ క్రమంలో 1950 కాల్ సెంటర్కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
తమకు సెలవులు కంపెనీలు సెలవులు ఇవ్వడం లేదని.. సెలవు ఇవ్వకపోతే ఓటు ఎలా వేయాలని ప్రైవేటు ఉద్యోగులు ప్రశ్నించారు. అయితే, ఈ క్రమంలో సీఈవో స్పందించారు. ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. ఎన్నికల కోసం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు చేసింది. పరిశీలన కోసం 22వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్ను నియమించింది.