Election Code | హైదరాబాద్లో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో జంట నగరాల పరిధిలో పోలీసులు భారీగా నగదు, బంగారం, వెండిని సీజ్ చేశారు. నార్త్జోన్ టాస్క్ఫోర్స్, గాంధీ నగర్ పోలీసులు కవాడిగూడ ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.9కోట్లను గుర్తించారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి.. కారు, బైక్ను సీజ్ చేశారు.
అలాగే మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్ ఎక్స్రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న 17 కిలోల బంగారం, 17 కిలోల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించిన బిల్లులు చూపకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. అలాగే వనస్థలీపురంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న రూ.29.40లక్షలను స్వాధీనం చేసుకున్నారు.