కట్టంగూర్, ఫిబ్రవరి 19: వృద్ధురాలికి మాయమాటలు చెప్పి భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన బెల్లి ఎల్లమ్మ 20 రోజుల క్రితం జ్వరంతో ఇబ్బందిపడింది. ఈ సమయంలో ఆమె బంధువు బెల్లి వీరయ్య కరోనా టెస్టు పేరుతో ఎల్లమ్మను తాసిల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి ఆమె పేరిట ఉన్న 27 గుంటల భూమిని అతడి భార్య వాణి పేరిట గత నెల 19న రిజిస్ట్రేషన్ చేయించుకొన్నాడు. ఆలస్యంగా విషయం తెలుసుకొన్న ఆ వృద్ధురాలు ఈ నెల 16న ఎస్పీకి, 18న కట్టంగూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు వీరయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కాగా, వీరయ్యను ఎస్సై విజయ్కుమార్ చితకబాదినట్టు సోషల్ మీడియాలో వైరలైంది. ఈ విషయమై ఎస్సైని వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు వీరయ్యను 18న సాయంత్రం స్టేషన్కు పిలిపించి విచారించినట్టు తెలిపారు. అనంతరం పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని చెప్పడంతో పంపించామని స్పష్టంచేశారు..