మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ పరిధిలోని గాగిల్లాపూర్లో దారుణం జరిగింది. ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకున్నది.. ఈ నెల 24న అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న తమ్ముడు సాయితేజ.. అన్న భరత్ను కుక్కర్తో కొట్టి చంపాడు. నిన్న ఉదయం స్నేహితులు ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. భరత్ స్నేహితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాయితేజ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.