సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 17: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులకు సందడి చేసే సమయం ఆసన్నమైంది. ఏటా అట్టహాసంగా నిర్వహించే ఎలాన్ వేడుకలను శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో డైరెక్టర్ బీఎస్ మూర్తి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
మూడు రోజులపాటు జరుగనున్న ఈ వేడుకల షెడ్యూల్ను డెరెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐఐటీ విద్యార్థులు తమ విభిన్న ప్రతిభా పాఠవాలను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటూ కేరింతలు కొట్టారు.