హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను (IAS Transfers) ప్రభుత్వం బదిలీ చేసింది. వాణిజ్య పన్ను శాఖ కమిషనర్ టీకే శ్రీదేవితోపాటు మరో ఏడుగురు ఐఏఎస్లను కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు. టీకే శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా నియమించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.
అదేవిధంగా రవాణా, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్ను, పురపాలక శాఖ డిప్యూటీ సెక్రెటరీగా ప్రియాంకను నియమించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్.హరీశ్కు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉదయ్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హాకా ఎండీగా చంద్రశేఖర్ రెడ్డిని, మార్క్ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి బదిలీచేశారు.