రంగారెడ్డి : జల్పల్లి మున్సిపాలిటీలో రూ. 20 కోట్లతో రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, జల్పల్లిని మరింత అభివృద్ధి చేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీలో బుధవారం మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ నినాదాలు, విధానాలని పేర్కొన్నారు. డివిజన్లలో సమస్యల పరిష్కారం కోసం ప్రణాళిక బద్దంగా కృషి చేస్తామన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో 10 బస్తీ దవాఖానాలు మంజూరు కాగా జల్పల్లిలోనే నాలుగు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ సాధి, వైస్ చైర్మన్ ఫర్హా నాజ్, నాయకులు ఖలీఫా, కృష్ణా రెడ్డి, యూసుఫ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.