జనగామ, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి బూట్లు వేసుకొని పూలమాల వేసిన ఘటనపై ఆదివారం అంబేద్కర్ యువజన, దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ తో కలిసి అంబేద్కర్కు నివాళులర్పించిన కొమ్మూరి దురాహంకారంతో బూట్లు వేసుకొని అపవిత్రం చేశార ని మండిపడ్డారు.
అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నేతలు శుద్ధిచేసి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు. కొమ్మూరి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు