పాపన్నపేట, మార్చి 6: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఈ నెల 8 నుంచి 10 వరకు జాతర జరుగనున్నది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, పిల్లలు వెళ్లడానికి 8 మినీ బస్సులను ఏర్పాటు చేసింది. వీఐపీ క్యూలైన్లు, బారికేడ్లు, తాగునీటి కుళాయిలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.