హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల కన్నా డిశ్చార్జిలే అధికంగా ఉంటున్నాయి. శనివారం కొత్తగా 4,298 మందికి వైరస్ పాజిటివ్గా తేలిం ది. అదే సమయంలో 6,026 మంది డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు 89.33 శాతానికి పెరుగగా, జాతీయ సగటు 83.8 శాతంగా నమోదైంది. కరోనా, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 32 మంది మరణించారు. శనివారం అత్యధికంగా జీహెచ్ఎంసీలో 601, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 328, రంగారెడ్డిలో 267, ఖమ్మంలో 203, నల్లగొండలో 199 కేసులు వెలుగుచూశాయి.