June 20 | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా ఒకేరో జు 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్ తరగతి గదులను ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా జూన్ 20న నిర్వహించే విద్యా దినోత్సవం రోజున దీనికోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో బుధవారం విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్సవాలు జరిగే 21 రోజులపాటు పదేండ్లలో విద్యారంగంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అన్ని విద్యాసంస్థల్లో సభలు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని వివరించాలని సూచించారు. ‘మన ఊరు- మన బడి, మన బస్తీ -మన బడి కింద ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొదటి విడతలో రూ.3,497.62 కోట్లు వెచ్చించి, 9,123 సూళ్లను అభివృద్ధి చేసినట్టు వివరించారు. సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకురాలు శ్రీదేవసేన, అధికారులు రమేశ్, జయప్రదాబాయి, లక్ష్మారెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.