BRS Working President KTR | కేంద్రంలో పదేండ్ల బీజేపీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం చేయడం సర్వసాధారణంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. ఈడీ ప్రదర్శించిన తొందరపాటు దుందుడుకు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కవిత అరెస్ట్ అనంతరం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
కవిత అరెస్టు విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈడీ వ్యవహరించిన తీరుపైన రేపు సుప్రీంకోర్టు కు సమాధానం చెప్పాల్సి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. కచ్చితంగా 19వ తేదీన జరిగే సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణలోకి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈడి స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని (అండర్ టేకింగ్) ను తుంగలో తొకి ఈరోజు అరెస్టు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. కచ్చితంగా న్యాయం గెలుస్తుందని, చట్టబద్ధంగా ఈ అంశంలో పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.