నాంపల్లి కోర్టులు, మే 11 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి అప్పగించాలని నాంపల్లి మెట్రోపాలిటన్ జిల్లా సెషన్స్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన నిందితులు ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి వాంగ్మూలాలను చంచల్గూడ జైలులో నమోదు చేసినట్టుగానే, మిగతా వారి వాంగ్మూలాలు సేకరించేందుకు ఆదేశాలివ్వాలని పిటిషన్లో ఈడీ కోరింది.
రేణుకరాథోడ్, ఢాక్యానాయక్, రాజేశ్వర్, పీ గోపాల్నాయక్, శమీమ్ను విచారించేందుకు ఈడీకి అప్పగించాలని పీపీ జగన్మోహన్ ఇటీవల 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కింది స్థాయి కోర్టు పరిధిలోకి రాదని తిరస్కరించడంతో గురువారం జిల్లా కోర్టులో పిటిషన్ను ఈడీ దాఖలు చేసింది. జిల్లా కోర్టు తీర్పును వాయిదా వేసింది.