హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. జనవరి 7న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నది. కేటీఆర్తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
జనవరి 2, 3వ తేదీల్లో విచారణకు రావాలని వారికిచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈసీఐఆర్ను నమోదుచేసిన ఈడీ అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపడుతున్నారు. క్యాబినెట్, ఆర్థికశాఖ ఆమోదం లేకుండా, ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా చెల్లింపులు జరిపారని ఏసీబీ ఆరోపిస్తున్నది.