రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. ఇవి కేంద్రంలోని బీజేపీ సర్కార్ జేబు సంస్థలుగా మారాయి. తెలంగాణపై కక్షసాధింపు చర్యలో భాగమే ఈ దాడులు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాన్ని ప్రోత్సహిస్తారా? లేక దాడులు చేస్తారా? ఇదేం సంస్కృతి? దాడులకు ప్రతి దాడి చేస్తాం.
మంత్రి గంగులపై ఈడీ దాడులు, మరో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులతో మోదీ సర్కార్ అరాచకాలకు పాల్పడుతున్నది. ఎలాంటి ఆధారాలు లేకుండానే మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూతురు కావడం వల్లే ఎమ్మెల్సీ కవితపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. దేశం లో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ పైనే కేంద్రం కుట్ర చేస్తున్నది.
– ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్