దేశ తలసరి రెట్టింపునకు 8-9 ఏండ్లు
ఆర్థిక సర్వే వెల్లడి
రాష్ట్ర తలసరి ఆదాయం మరో ఐదారేండ్లలో రెట్టింపు అవుతుందని రాష్ట్ర ఆర్థిక సర్వే-2022 అంచనావేసింది. దేశ తలసరి ఆదాయం రెట్టింపు కావటానికి 8-9 ఏండ్లు పడుతుండగా, రాష్ట్రంలో మాత్రం ఐదేండ్లు పడుతున్నదని తెలిపింది. 2014-15 నుంచి 2021-22 వరకు సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్), తలసరి ఆదాయ వృద్ధిరేటులో తెలంగాణ, జాతీయ గణాంకాల ఆధారంగా ఈ అంచనా వేసింది. కరోనా సంక్షోభాన్ని అధిగమించి 2021-22లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకొని స్థిర ధరల వద్ద 11.2 శాతం వృద్ధిరేటు నమోదుచేసిందని తెలిపింది.
తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్
సోషియో ఎకనామిక్ ఔట్లుక్-2022 వెల్లడి
రాష్ట్ర తలసరి ఆదాయంలో తొలి మూడు స్థానాలను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాలే కైవసం చేసుకొన్నాయి. ప్రస్తుత ధరల సూచీ ప్రకారం 6.58 లక్షల తలసరి ఆదాయంతో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు ఉన్నట్టు సామాజిక ఆర్థిక సర్వే-2022 నివేదిక పేర్కొన్నది. వికారాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, హనుమకొండ జిల్లాలు చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు