హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో కారును పోలిన వాటిని తొలగించడంలో ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని పెడచెవిన పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఈసీ ప్రకటించిన గుర్తుల జాబితాలో కారును పోలిన గుర్తులు ఉండటంతో.. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థుల ఓట్లపై ప్రభా వం చూపే అవకాశం ఉన్నదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్వో)లకు పంపిన ఫ్రీ సింబల్స్లో చపాతీ రోలర్ (రొట్టెల పీట), డోలి, కుట్టు మిషన్, సబ్బు డబ్బా, టీవీ, కెమెరా, పడవ, రోడ్డు రోలర్ వంటి గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులను జాబితా నుంచి తొలగించాలని బీఆర్ఎస్ గతంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఆ గుర్తులు కారుకు దగ్గరి పోలికలు కలిగి ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థికి రావాల్సిన ఓట్లు ఓటర్ల పొరపాటు కారణంగా వారికి పోలైనట్టు పలుమార్లు వెల్లడైంది.
ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడం కోసం మొత్తం 193 ఫ్రీ సింబల్స్ను జాబితాను సీఈసీ ప్రకటించింది. గుర్తింపుపొందిన జాతీ య, ప్రాంతీయ పార్టీలకు వారు ఎంచుకున్న గుర్తులు కొనసాగుతాయి. రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రుల కోసం మాత్రం ఫ్రీ సింబల్స్ నుం చి వారు ఎంచుకున్న గుర్తులను కేటాయిస్తారు. ఈ గుర్తులను అధికారులు(ఆర్వో)లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులేట్ చేసింది. ఒకే గుర్తును ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కోరితే లాటరీ విధానంలో వారికి ఆ గుర్తు కేటాయిస్తారు. రిజిస్టర్డ్ పార్టీలు తమకు కామన్ సింబల్ కేటాయించాలని వారికి రాష్ట్రంలో ఒకే గుర్తును కేటాయించే అవకాశం ఉంటుంది.
కారు గుర్తును పోలిన రోడ్ రోలర్ గుర్తును ఎన్నికల సంఘం యుగ తులసి పార్టీకి కేటాయించింది. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు వేయాలనుకున్న ఓటర్లు కారు గుర్తును పోలి ఉన్న రోడ్ రోలర్కు వేశారు. సోమవారం ఢిల్లీలో డ్రా ద్వారా రోడ్ రోలర్ గుర్తును ఆ పార్టీకి కేటాయించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యుగ తులసి పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని దరఖాస్తు చేయడంతో కామన్ సింబల్ను కేటాయించినట్టు ఎన్నికల తెలిపింది.